ప్రముఖ ఉక్కు సంస్థ సుగ్న మెటల్స్ లిమిటెడ్ ఈ రోజు సిరిసిల్లలో లక్ష్మి ట్రేడర్స్ సందానంద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కార్మికులకు , మేస్త్రీలకు, ఒక అవగాహన సదస్సు ని నిర్వహించింది. ఈ సదస్సుకు సిరిసిల్ల జిల్లా చుట్టూ ప్రక్కల మండలాల నుండి అనేక మంది మేస్త్రీ లు,నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుగ్న సంస్థ నుండి జనరల్ మనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ నితిన్ జైన్ ,డిస్ట్రిబ్యూటర్ అమిత జలాన్ పాల్గొన్నారు. ముందుగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో తరచుగా నిర్మాణసమయంలో అనేక చోట్ల ప్రమాదాల జరుగుతున్నాయని ,కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు. సిరిసిల్ల డీలర్ సదానంద రెడ్డి మాట్లాడుతూ .ఎత్తైన గృహానిర్మాణాలు చేస్తున్నపుడు ప్రమాదం జరగకుండా కార్మికులు తప్పక తలకు హెల్మెట్లు, కాళ్లకు బూట్లు,,చేతులకు గ్లౌసెస్ వంటి వి తప్పని సరిగా వాడాలని ,ఎత్తైన గోడలు నిర్మిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉండరాదని పడిపోకుండా తాళ్ళు ,స్టాండ్లు ఏర్పాటు చేరుకోవాలని సూచించారు.. అనంతరం సుగ్న మెటల్స్ జనరల్ మనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ నితిన్ జైన్ మాట్లాడుతూ, సుగ్న మెటల్స్ లిమిటెడ్ గత పది సంవత్సరాలుగా స్టీల్ ఉత్పత్తి చేస్తోందని, మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల కన్నా ఎంతో భిన్నంగా నాణ్యతకు ప్రధాన్యతనిస్తూ వికారాబాద్ జిల్లా పరిగి లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మించిన సువిశాల ఫ్యాక్టరీ లో నెలకు 15 వేల టన్నుల స్టీల్ ని ఉత్ఫత్తి చేస్తూ తెలంగాణ ,ఆంధ్ర, కర్ణాటకలో సప్లయి చేస్తున్నామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గృహ సముదాయానికి సుగ్న స్టీల్ని అందిస్తున్నామన్నారు. టాటా, నాగార్జున ,పాలోమి జె ఎస్. డబ్ల్యూ వంటి అనేక సంస్థలు కోడా సుగ్న స్టీల్ నే తమ తమ ప్రాజెక్ట్స్ లో ఉపయోగిస్తున్నట్లు నీతిన్ జైన్ తెలియ చేశారు.ఈ సందర్భంగా సుగ్న మెటల్స్ సీనియర్ సెల్స్ మేనేజర్ వేణుకుమార్ మాట్లాడుతూ పదికాలాల పాటు భవనం పటిష్టంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టీల్ ఎంపిక దాని వాడకం, మేలైన నాణ్యమైన పటిష్టంగా ఉండేందుకు కొత్తగాఉత్ఫత్తి చేసుస్తున్న ,మార్కెట్లో అధిక డిమాండు ఉన్న సుగ్న టర్బో టి ఎం.టి 550 బార్ ల వాడకం వాటివల్ల నిర్మాణానికి ఉండే అదనపు లాభాల గురించి విచారించారు..అనంతరం మేస్త్రీ లందరికి ప్రోత్సహక బహుమతులు సుగ్న టి షర్ట్స్, క్యాప్స్, టిఫన్ బాక్స్ ఉన్న గిఫ్ట్స్ ని బహుకరించారు.