ప్రస్తుత దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశాలలో ముఖ్యమైనది రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం. ఫ్రాన్స్ దేశంతో మన దేశం చేసుకున్న ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పార్టీని విమర్శించింది. ఈ నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాన్ని బుధవారం ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు. సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృందానికి చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ నిన్న ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రఫేల్ యుద్ధ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు.
నిన్న జరిగిన వైమానిక ప్రదర్శన రిహార్సల్స్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఢీకొన్న ఘటనలో సాహిల్ మృతి చెందగా స్క్వాడ్రన్ లీడర్ తేజేశ్వర్ సింగ్, వింగ్ కమాండర్ విజయ్ శేల్కిలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సాహిల్కు నివాళులర్పిస్తూ రఫేల్ యుద్ధ విమానం సాధారణ వేగంతో ప్రదర్శన ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలోనే సూర్య కిరణ్ ఏరోబేటిక్స్ బృందం ప్రదర్శనకు దూరంగా ఉంది. ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానాలను గత వారం భారత్కు తరలించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో మొత్తం 61 విమానాలు పాల్గొననున్నాయి.