ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ బరిలో ఎమ్మెల్సీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 09:04 PM

రాబోయే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అన్ని ప్రధాన పార్టీల‌ వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ప్రతి విషయంలో పార్టీలు ఆచీతూచీ అడుగు వేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు పోతున్నారు. అభ్యర్దు ఎంపికలో చాలా పటిష్ట నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దానిలో భాగంగా రాజీనామా అనే వ్యూహాత్మక నిర్ణయంతో విజయమే క్ష్యంగా ఎన్నిక బరిలోకి అభ్యర్థుల‌ను పంపుతున్నారు. రాజీనామా ద్వారా కొత్త సంప్రదాయానికి తెరదీశారు. శాసనమండలిలో సభ్యులైన టీడీపీ సీనియర్‌ నేతల్లో కొందరు తాజా ఎన్నికల్లో శాసనసభ ఎన్నిక బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు శాసనమండలికి రాజీనామా చేసి, వాటిని ఆమోదింపజేసుకుని కొత్త సంప్రదాయానికి తెరదీశారు. కనీసం మరో నలుగురు ఎమ్మెల్సీలు ఈ బాటలోనే ముందుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది. సమీకరణాలు అనుకూలిస్తే ఇంకో ఇద్దరు, ముగ్గురు సైతం పోటీ పడే అవకాశం లేకపోలేదు . వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనసభ ఎన్నిక బరిలో నిల‌వనున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోవటంతో  గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై  మంత్రివర్గంలో స్థానం ద‌క్కించుకున్నారు.  ఇటీవ‌ల ఎమ్మ‌ల్సీకి రాజీనామా చేసిన ఆయ‌న  రాబోయే ఎన్నిక‌ల‌లో సర్వేపల్లి నుంచి శాసనసభకు పోటీ కి సిద్ద‌మ‌వుతున్నారు.  ఇక కడప జిల్లా జమ్మల‌మడుగుకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా  గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అయ్యి ప్రభుత్వ విప్ గా పదవి ద‌క్కించుకున్నారు.  మంత్రి ఆదినారాయణరెడ్డితో కుదిరిన ఒప్పందంలో భాగంగా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయ‌న తాజాగా ఆయన జమ్మల‌మడుగు నుంచి శాసనసభకు పోటీకి సై అంటున్నారు.  ఇక విద్యాసంస్ధ‌ల అధినేత మంత్రి పి.నారాయణ గ‌త ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకి స‌హ‌కారం అందించి, సేవ‌ల‌కుగుర్తింపుగా మంత్రి ప‌ద‌వి పొందారు. ఆపై మండలిలో సభ్యుల‌య్యారు. రాబోయే ఎన్నికల్లో ఆయన న్లెల్లూరు  నియోజకవర్గం నుంచి శాసనసభకి పోటీ చేయబోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఇక  అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి కిందటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సీనియర్‌ నేత పయ్యావుల‌ కేశవ్   ఎమ్మెల్సీ అయ్యాక‌. చీఫ్‌విప్ ప‌ద‌వి పొందారు. రానున్న ఎన్నిక‌ల‌లో ఆయ‌న ఉరవకొండ నుంచి తిరిగి బరిలో నిల‌చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక గ‌త  ఎన్నికల్లో ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిన సీనియర్‌ నేత మాగుంట శ్రీనివాసురెడ్డి  స్థానిక సంస్థ కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో ఒంగోలు నుంచే ఆయన్ను లోక్‌సభకు పోటీ చేయించాల‌ని పార్టీ భావిస్తోంది.  ఇక 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీకి దిగి ఓడిపోయిన  కరణం వెంకటేష్ కు పోటీగా  వైసిపి నుంచి గొట్టిపాటి రవి టీడీపీలోకి రావ‌టంతో కొంత ఇబ్బంది ప‌డ్డారు. అయితే వెంకటేష్‌ తండ్రి, సీనియర్‌ నేత కరణం బల‌రాంకి ఎమ్మెల్సీగా చంద్ర‌బాబు అవకాశమివ్వ‌టంతో కొంత స‌ర్దుకున్నారు. అయితే   ఇండిపెండెంట్‌గా గెల‌చి పార్టీలో చేరిన చీరాల‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవ‌ల తెలుగుదేశానికి గుడ్‌పై చెప్పి వైసిపిలో  చేరటంతో  క‌ర‌ణం వెంక‌టేష్‌గానీ, ఆత‌ని తండ్రి బల‌రాంని గానీ ఇక్క‌డ పోటీకి దింపే ఛాన్సుంది.   ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త  న్నికల్లో పోటీ చేసి ఓడిన త‌దుప‌రి శాసనమండలిలో సభ్యురాల‌యిన పోతు సునీత కూడా   శాసనసభ ఎన్నికల‌లో పోటీకి దిగాల‌ని చూస్తున్నారు. ఇక విశాఖ జిల్లా  అరకు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిన త‌దుప‌రి మండ‌లి స‌భ్య‌రాలైన‌ సంధ్యారాణి  విజయనగరంజిల్లా సాలూరు ఎస్టీ రిజర్వ్‌డు స్థానం వైపు దృష్టి సారించారు.  ఇక ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, రాష్‌ట్ర ఐటి మంత్రి   లోకేశ్ సైతం  ప్రస్తుతం శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు.  ఈసారి శాసనసభ ఎన్నికల‌లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలో ఉండాల‌ని  ప‌లు నియోజకవర్గాల‌ను   పరిశీలి స్తున్నారని స‌మాచారం.


వైసీపీ నుంచి 
వైసీపీ నుంచి  మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న  విజయనగరం  జిల్లాకు చెందిన   కోగట్ల వీరభద్రస్వామి   ఏలూరు నుంచి    శాసనమండలికి ఎన్నికయిన  ఆళ్ల నాని కూడా గ‌తంలో తాము పోటీకి దిగిన  స్థానాల‌ నుంచి శాసనసభకి పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాల‌ సమాచారం అందుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com