తెలుగుదేశం పార్టీని తాను వీడే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లోక్సభ పోటీ చేయాలా? లేక అసెంబ్లీకి పోటీ చేయాలా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. బీసీ గర్జన సభ పెట్టే అర్హత జగన్కు లేదన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ ఎక్కడా బీసీ అధ్యక్షును నియమించలేదని మంత్రి విమర్శించారు. అవంతి శ్రీనివాస్ చేసిన విమర్శపై స్పందించిన మంత్రి గంటా అతనిలా దిగజారి మాట్లాడే స్వభావం తనదికాదన్నారు.