శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖామాత్యులు కిమిడి కళావెంకట రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కళా ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తుందని తద్వారా ప్రజలకే అంతిమ ప్రయోజనం దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు.