న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ బీజేపీ బూత్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మాట్లాడారు. కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, విజయనగరాల నేతలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్కు వచ్చినన్ని సంస్థలు దేశచరిత్రలో ఏ రాష్ర్టానికీ దక్కలేదు. ఇలాంటి సంస్థలను ఏపీలో ఇంతకాలం ఏర్పాటు చేయనందుకు టీడీపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. యువత వ్యతిరేక ప్రచారాన్ని నమ్మదు. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ను యువతకు వివరించండి. యువతతో అన్ని అంశాలపై క్లుప్తంగా చర్చించండి. వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏపీలో పాలకులు ఏదైనా చేసే ఉంటే ఆ పని గురించి మాట్లాడేవారు. వాస్తవాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి. అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించండి అని మోదీ వ్యాఖ్యానించారు.
PM Narendra Modi, Bjp, Booth Level Workers,