గుంటూరు : ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ… రాఫెల్ స్కాంలో ప్రతిపక్షాలు చేతులు కాల్చుకున్నాయన్నారు. రక్షణ వ్యవస్థను ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయన్నారు. ప్రధాని మోడీపై పత్రికలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. అగ్రిగోల్డ్, భూకుంభకోణం, కేంద్రం నిధులపై పోరాటం చేశామన్నారు. కేంద్రం నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారన్నారు.