పెథాయ్ తుఫాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. బలమైన ఈదురుగాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. వర్షానికి వరి ధాన్యం తడిసిముద్దైంది. తొండంగి, తుని, కోటనందూరు మండలాల్లో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఏలేశ్వరం మండలంలోనూ అరటి తోటలు దెబ్బతిన్నాయి. గొల్లప్రోలు మండలంలో పత్తి పంట తడిసిపోగా, వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అలాగే తొండంగి మండలంలో విద్యుత్ సరఫరా పునరుద్దరణ కావాల్సి ఉంది. ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం మండలాల్లో కూరగాయల పంటలు నేలకొరిగాయి.