ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ-నీతా అంబానీ కుమార్తె ఈశాకు అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో పిరమాల్ కుటుంబం పేరిట ఉన్న రూ.450కోట్ల విలువైన గులీటా భవనాన్ని అజయ్, స్వాతి పిరమాల్ దంపతులు ఈశా-ఆనంద్ జంటకు కానుకగా ఇవ్వనున్నారట. డిసెంబర్ 12న వివాహం అనంతరం నూతన దంపతులు ఇదే భవనంలో నివసించనున్నారు. వర్లీలోని హిందుస్థాన్ యూనిలీవర్కు చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకొంది. అప్పటి నుంచి దీన్ని వివిధ రకాల శిక్షణ కేంద్రాలకు వినియోగిస్తున్నారు. ఈ ఐదంతస్తుల భవనం అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉంటుంది. ఆరేళ్ల క్రితం వేలంలో దీన్ని దక్కించుకున్నా.. పూర్తి హక్కులు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 19న పిరమాల్ కుటుంబానికి బదిలీ అయ్యాయి.