ఎన్నికల కోసమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తీసుకొస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు మళ్లీ ఇంకో దోపిడీకి శంకుస్థాపన చేస్తున్నారని, అదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నారు. చంద్రబాబు, దేవినేనిలు ఉత్తరాంధ్ర ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. పవన్ చేస్తున్నదే కులరాజకీయాలన్నారు. పవన్ కులం పేరు, ఇంటి పేరు మార్చుకున్నాడా అని ప్రశ్నించారు.