ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజు ప్రారంభమైన ద్వారక తిరుమల యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 02:27 PM

పశ్చిమగోదావరి జిల్లా లో రెండో రోజు ఎక్సైజ్ శాఖామంత్రి  జవహర్  ద్వారకతిరుమల పాదయాత్ర ప్రారంభమైంది. చాగల్లు మండలంలో ఉనగట్ల, కలవలపల్లి చిక్కాల, చిక్కాల గ్రామాల్లో మంత్రి జవహర్  పాదయాత్ర నిర్వహించారు.  ఎంపీలు మురళీ మోహన్, తోట సీతా రామలక్ష్మి, నిడదవోలు ఎమ్మెల్యే శేషారావులు హాజరయ్యారు. చాగల్లు మండలంలో ఉనగట్ల, కలవలపల్లి చిక్కాల, చిక్కాల గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ మంత్రి జవహర్ మాట్లాడుతూ ద్వారక తిరుమల  పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి జవహర్ అన్నారు.  చంద్రబాబు మళ్ళీ నువ్వే సీఎం కావాలని కోరుకుంటూ రెండవరోజు ప్రజా ఆదరణ తో  పసివేదలలో ప్రారంభమైన యాత్ర  పోతవరంలో ముగుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వెంకన్న స్వామికి పాద యాత్రగా వెళ్లి నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. చంద్రన్న మళ్ళీ అధికారంలోకి రావడానికి నవ్యాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com