విశాఖపట్నం : టీడీపీ ఎంపీలు ఏపీని అవినీతిలో నెంబర్వన్ చేశారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐటీ దాడుల విషయంలో ప్రజలను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఐటీ దాడులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.సీఎం రమేష్పై ఐటీ దాడుల విషయం బీజేపీ నేతలకు ముందే తెలుసునని ప్రజలను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎక్కువ సోదాలు ఏపీలోనే ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే అవినీతి అనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అక్రమ సంపాదన లేకపోతే, ప్రజల సొమ్ము దోచుకోకపోతే.. ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.