అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే 50 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళ దుంప, కేజీ ఉల్లిపాయలు, లీటర్ నూనె, అరకిలో పంచదార ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళంలో యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తుండడంతో చర్యలు వేగవంతం అయ్యాయి. సహాయక చర్యలలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఇలా అన్ని శాఖలు సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. కాగా ఇప్పటికే తూర్పు నావికాదళ సిబ్బంది బాధితులకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణి చేస్తుండగా జెమిని బొట్లు, డ్రైవర్లను ప్రవాహ ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు సహాయక చర్యలలో చేతక్ హెలికాఫ్టర్లు పాల్గొనగా కాసేపట్లో ఐఎన్ఎస్ రన్ విజయ్ యుద్ధనౌక కూడా శ్రీకాకుళం చేరుకోనుంది.