భోపాల్ : లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోలేదనే కోపంతో ఓ వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 370 కిలోమీటర్ల దూరంలోని సియోనీలో నిన్న చోటు చేసుకుంది. సియోనీలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రభుత్వ బాలిక కళాశాలలో 23 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతోంది. ఈ యువతిని గతకొంత కాలంగా అనిల్ మిశ్రా(38) అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. మిశ్రా వేధింపులు భరించలేక.. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని యువతిపై మిశ్రా ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇందుకు నిరాకరించడంతో.. కాలేజీకి వెళ్తున్న యువతిని జుట్టు పట్టుకొని పబ్లిక్లోకి ఈడ్చుకెళ్లాడు. అందరూ చూస్తుండగానే ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే.. యువతి మృతి చెందింది. నిందితుడు అనిల్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. యువతిని తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట మిశ్రా అంగీకరించాడు.