న్యూఢిల్లి : దేశవ్యాప్తంగా జైళ్లలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీ జైళ్లలో సమస్యలు, ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటం మొదలై పలు విషయాలపై అధ్యయనం చేసి , ఆ సమస్యలను పరిష్కరించడానికి తగిన సూచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా 1382 జైళ్లలో దుర్భర పరిస్థితులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంబి లోకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీగా నిధులు సేకరించినప్పటికీ వాటిని సరైన విధంగా ఉపయోగించలేదని ధర్మాసనం పేర్కొంది.