ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోదా కోసం టిడిపి సైకిల్‌ యాత్రలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 21, 2018, 10:07 AM

 అమరావతి : ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి చేపట్టిన 15 రోజుల సైకిల్‌ యాత్ర మొదలు పెట్టింది. అందులో భాగంగా పుట్టపర్తిలో శనివారం హనుమాన్‌ సర్కిల్‌ నుంచి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి ఉదయం 9 గంటలకు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర పుట్టపర్తి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌, గోకుళం,గణేష్‌ సర్కిల్‌ ,ఎనుములపల్లి , బ్రహ్మణపల్లి, బడేనాయక్‌ తాండా, గోనే నాయక్‌ తాండా, కప్పలబండ, మామిళ్ల కుంట క్రాస్‌ , కొత్తచెరువు వరకు సాగే సైకిల్‌ యాత్రలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ తో పాటు స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com