కృష్ణా : నూజివీడు మండలంలోకి నేడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించనుంది. ఆగిరిపల్లి మండలం సీతారాంపురం గ్రామం వద్ద శనివారం ఉదయం ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో బత్తులవారిగూడెం - యనమదల క్రాస్రోడ్డు వద్దకు చేరుకుంటోంది. అక్కడి నుంచి 11.30కు యనమదల గ్రామంలో యాత్ర పూర్తయిన అనంతరం 12.30 సమ యంలో గ్రామంలోని ఊరి చివర చెరువు వద్ద మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు నూజివీడుకు జగన్ చేరుకుని చిన్నగాంధీ బమ్మసెంటర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.