న్యూఢిల్లీ : తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడి పారిపోతోందని తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన సభ ఆర్డర్ లో లేదనే నెపంతో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. సభను ఆర్డర్ లో ఉంచాల్సిన బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు.