ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా జరిగే వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంపై నోటీసులు ఇస్తూనే ఉంటామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు అవిశ్వాసం మళ్లి నోటీసులు ఇచ్చిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటు ఆవరణలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ జరిగే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.