న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై తెలుగుదేశం, వైకాపాలు ఇచ్చిన నోటీసలు అందాయని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ధృవీకరించారు. అయితే సభ ఆర్డర్ లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టలేకపోతున్నామని ఆమె పేర్కొన్నారు. సభను సోమవారానికి వాయిదా వేసే ముందు స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై నోటీసులు అందిన విషయాన్ని సభలో ప్రకటించారు.