న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలన్నిటినీ నెరవేర్చాలి అంటూ తెలుగుదేశం ఎపీలు పార్లమెంటు వద్ద చేస్తున్న ఆందోళన నేడూ కొనసాగింది. రోజుకో వేషం ధరిస్తూ ఆందోళనలో పాల్గొంటున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మత్స్య కారుని వేషంలో ఆందోళనలో పాల్గొన్నారు. వల విసురుతూ…కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న శివప్రసాద్ ఆందోళన అందరినీ ఆకట్టుకుంది.