విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతూనే ఉంటామని టిడిపి ఎంపి కేశినేని నాని అన్నారు. శనివారం ఆయన 10-టివి ప్రతినిధితో మాట్లాడుతూ.. పార్లమెంటులో తమ ఎంపిల నిరసన ప్రారంభం మాత్రమేనని అన్నారు. కేంద్రం వద్ద 19 అంశాలు పెండింగ్లో ఉన్నాయని, పెండింగ్లో ఉన్న అంశాలను సాధించడానికి ఎంతవరకైనా వెళ్తామని తెలిపారు. విభజన చట్టంలో హావీలను కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనోభావాలను వినిపించామని చెప్పారు.