ప్రధానమంత్రి నరేంద్రమోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్న సందర్భంగా దుబాయ్లోని ప్రఖ్యాత ప్రాంతాలన్నీ భారతీయ జెండా రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడీఎన్ఓసీ), ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ ‘దుబాయ్ ఫ్రేమ్’లు భారతీయ జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేశాయి. దీనికి సంబంధించిన ఫొటోలను యూఏఈలో భారత రాయబారి ట్విటర్ ద్వారా పోస్టు చేశారు.
శనివారం సాయంత్రం ప్రధాని మోదీ అబుదాబి చేరుకుంటారు. ఆయనకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నెహ్యాన్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. పర్యటన సందర్భంగా ఇరు దేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ఆదివారం దుబాయ్లో జరగనున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కు యూఏఈ నేతలతో కలిసి మోదీ హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో భారత్ అతిథ్య దేశంగా ఉండనుంది.