ఉత్తరప్రదేశ్ : నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిల్వ ఉంచిన శాంపిల్ మెడిసిన్స్ను యూపీ పోలీసులు సీజ్ చేశారు. మొరదాబాద్లోని సాంబాల్, అమ్రోహా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.కోటి విలువైన శాంపిల్ మెడిసిన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నారు.