వరికి గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దావోస్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు రైతులకు అండగా నిలవాలన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గిట్టుబాటు ధరపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.