చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 69వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 69వ రోజు పాదయాత్రను తొట్టంబేడు మండలం రెడ్డిగుంటబాడవ శివారు నుంచి ప్రారంభించారు. జగన్ పాదయాత్ర సూరమాల గ్రామంతో చిత్తూరు జిల్లాలో ముగించుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలోని పీసీటీ కండ్రిగ, పెనబాక, అర్లపాడు క్రాస్, చెంటేడు, నందిమాల క్రాస్, సీఎన్పేట మీదుగా ఉమ్మాలపేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జగన్ నెల్లూరు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోపాదయాత్ర కొనసాగనుంది.