పల్నాడు జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు కానీ అక్రమ కార్యకలాపాలు కానీ జరగడానికి వీలులేదు అని ఇప్పటికే , జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా తెలియచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పల్నాడు జిల్లా, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త గణేశుని పాడు గ్రామంలో నాటుసారా తయారుచేసే ప్రదేశాలపై ముమ్మర దాడులు జరిపి ఒకరిని అదుపులోకి తీసుకొని, 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను సీజ్ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు. అలానే నరసరావుపేట II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ స్థావరంపై ఆకస్మిక దాడి జరిపి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 12,700/- రూపాయలను సీజ్ చేయడం జరిగినది.