అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రు వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొండాడ సుమంత్ (31), కోడే శరత్ (28) కారులో భీమవరం నుంచి నిడమర్రు వస్తుండగా మందలపర్రు వద్ద కారు అదుపు తప్పి చినకాపవరం కాలువలోకి దూసుకుపోయింది. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నిడమర్రు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.