రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.... వ్యవస్థలు పనిచేస్తున్నాయా...? అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు,మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గుంటూరు లోని తన కార్యాలయంలో ఆదివారంఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విపరీత పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ప్రతిపక్ష నాయకుడి ఇంటి పైకి దాడికి వెళ్లి.. దానిని వైసీపీ నేతలు సమర్థించుకోవటం సిగ్గుచేటన్నారు. పోలీసులు అధికార పార్టీ చర్యలను సమర్ధించటం దుర్మార్గమని తెలిపారు. డీజీపీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేసుకోవాలని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును హరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటి పైకి ఎమ్మెల్యే జోగి రమేణోపాటు దాడికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆనందబాబు కోరారు.