ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 8న తలపెట్టిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. వైఎస్ఆర్ జయంతి రోజు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే రోజును ఇవాళ ప్రభుత్వం ప్రకటించనుంది. ఆగస్టు 15న ఆ కార్యక్రమం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.