కరోనా వేళ మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం దందా జోరుగా సాగుతోంది. హోటళ్లు, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్ నివాసాల్లో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం. వాట్సాప్ లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు వారిని పంపిస్తూ కొందరు జేబులు నింపుకుంటున్నారు. రోజుల తరబడి కూడా బుకింగ్లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని హోటల్స్ అందుకు అడ్డాలుగా మారుతున్నాయి. నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో దర్జాగా ఈ దందా సాగుతోంది. ఈ హోటల్లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్ చేసుకుంటే హోటల్లో రూమ్ కూడా ఫ్రీగా ఇస్తుంటారని స్థానికంగా చెప్పుకుంటున్నారు.
గంటకు రూ.3వేల నుంచి 5వేలు, రాత్రికి రూ.5 నుంచి 10 వేల వరకు బుకింగ్లు జరుగుతున్నాయని సమాచారం. ఇక హౌసింగ్ బోర్డు కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. ఇక నగర శివారులో ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఈ తరహా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోందని చెబుతున్నారు. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి ఈ రొంపిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో రుచిమరిగిన విటులకు వారి ఫొటోలను పంపి వారి కోరికలు తీరుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లాక్డౌన్కు ముందు కంటే ఇప్పుడు ఈ దారుణం ఎక్కువైందని చెబుతున్నారు. ఈ మధ్య ఓ చానల్లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.
టీవీల్లో చిన్న చితకా పాత్రల్లో నటించిన నటులు, యాంకర్లను బుక్ చేసుకుని నగరానికి తీసుకొచ్చి వారితో వ్యాపారం సాగిస్తున్నారు. స్థానిక హోటల్స్లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడు తమకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్లో నిర్వహించిన ఈవెంట్స్లో పాల్గొన్న యాంకర్లలో ఒకర్ని బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో నాలుగురోజుల పాటు ఉంచి ఎంజాయి చేశారని విశ్వసనీయ సమాచారం. ఈ హైటెక్ వ్యభిచారం గురించి పోలీసులకు తెలిసినా వారు కావాలనే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.