వక్రబుద్దితో ఓ వ్యక్తి తన భార్యతోనే అసభ్య చాట్ చేశాడు. ఆమెను బెదిరించి రూ.కోటి వరకు వసూలు చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రమీలకు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కరీంనగర్ లో ఉంటున్న సంతోష్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇరువురు తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ప్రమీల తల్లిదండ్రులు రూ.15లక్షలు కట్న కానుకలిచ్చారు. కొన్ని రోజుల తర్వాత ప్రమీల వృత్తిరిత్యా అమెరికాకు వెళ్లింది.సంతోష్ మాత్రం కరీంనగర్, హైదరాబాద్ లో ఉండేవాడు. ఆ అవసరం, ఈ అవసరం అని చెప్పి ఆమె దగ్గరి నుంచి రూ.63 లక్షలు వసూలు చేశాడు. సత్యహర్షరెడ్డి అనే పేరుతో ప్రమీల మొబైల్ నంబర్ కు, మెయిల్ కు అసభ్యకరమైన సందేశాలు,వీడియోలు పంపేవాడు. దీంతో తన భర్త పై అనుమానం వచ్చిన భార్య అమెరికా నుంచే పోలీసులకు విషయం తెలిపింది. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి దగ్గరి నుంచి అరెస్ట్ అయ్యే వరకు తన వద్ద రూ.కోటి తీసుకున్నాడని ప్రమీల ఆరోపిస్తుంది.