ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్

national |  Suryaa Desk  | Published : Tue, May 12, 2020, 04:53 PM





మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఛాతీ నొప్పి సమస్యతో మన్మోహన్ సింగ్ శనివారం రాత్రి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు రెండు రోజులుగా వైద్యులు చికిత్స అందించారు. 2009లో ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ కు బైపాస్ సర్జరీ అయ్యింది. అప్పట నుంచి ఆయన మందులు వాడుతున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన మరసారి ఛాతినొప్పికి గురయ్యాడు. కరోనా పరీక్షల్లో కూడా ఆయనకు నెగటివ్ వచ్చింది. దీంతో డాక్టర్లు మన్మోహన్ సింగ్ పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.









 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com