కరోనా కట్టడికి దేశంలో విధించిన 21రోజుల లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని గట్టి సంకేతాలు వస్తున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. లాక్డౌన్ కొనసాగించే విషయంపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. లాక్డౌన్ పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎంలతో సమీక్ష అనంతరం ప్రధాని కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.