నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చిన సంఘటన డిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో పని చేస్తున్న వైద్యుడికి కరోనా సోకింది. ఆయన ఎయిమ్స్ లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వారి ద్వారా ఆయనకు కరోనా సంక్రమించింది. అయితే ఆయన ద్వారా తొమ్మిది నెలల గర్భిణి అయిన ఆయన భార్యకూ కరోనా సోకినట్లు తెలింది. ముందుగా వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్యకు వైద్యు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో తొమ్మిది నెలల గర్భవతి అయిన ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది