టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక పదవి లభించింది. నాని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు, వాటికి సంబంధించిన నిబంధనలు, హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను కూడా కమిటీ పర్యవేక్షించనుంది.