ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తెచామనడం అవాస్తవం అని అమిత్ షా అన్నారు. పొరుగుదేశాలతో పోలిస్తే భారత్ లో మైనారిటీలకు రక్షణ ఎక్కువ ఉందని అమిత్ షా అన్నారు. దేశ విభజన సమయంలో పౌరసత్వానికి కటాఫ్ తేదీ పెట్టలేదా ? అని అయన అన్నారు. బాంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. దేశంలో అక్రమ వలసలు నిరోధించేందుకు పౌరసత్వ సవరణ బిల్లు అని అయన అన్నారు.