పవన్కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. జగన్కు వస్తున్న పేరు చూసి ఏడ్వొద్దని మంత్రి కొడాలి అన్నారు. పవన్ కల్యాణ్ గుర్తించకుంటే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని ఎద్దేవా చేశారు. పవన్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జనసేనను బీజేపీలో విలీనం చేసేందుకు పవన్ కల్యాణ్ భారీ ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అమిత్షాను పొగడడం, మద్దతు ఇవ్వడం ద్వారా విలీన సంకేతాలిచ్చారా? అని ప్రశ్నించారు. జనసేనను విలీనం చేయాలని అమిత్షా అడిగారని స్వయంగా పవనే చెప్పారన్నారు. మోడీ, అమిత్షాలను పొడిగితే పవన్ ఎలా జైలుకెళ్తారని ప్రశ్నించారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటారని విమర్శించారు. దేశంలో ఉల్లి రూ.100 ఉంటే, ఏపీలో మాత్రం రూ.25 ఉందన్నారు. రాజధాని రైతులను చంద్రబాబు కబుర్లతో చంద్రబాబు మోసం చేశారన్నారు. దాడి చేయాలనుకుంటే కర్నూలులో పర్యటిస్తోన్న బాబుపై దాడి చేయలేమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారన్నారు. ఉనికి చాటుకోవడం కోసమే చంద్రబాబు కామెంట్ చేస్తున్నారన్నారు.