న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్కు ఓ వ్యక్తి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ఈ ఘటన పార్లమెంట్కు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రక్షణ మంత్రి కాన్వాయ్కు వ్యక్తి అడ్డంగా రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు ప్రధాని నరేంద్ర మోదీని కలిపించాలని ఆ వ్యక్తి కోరాడు. అక్కడ్నుంచి రాజ్నాథ్ కాన్వాయ్ వెళ్లిన అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.