రాష్ట్ర ప్రభుత్వం బార్ల ఏర్పాటుకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ప్రభుత్వం బార్లకు ఇచ్చిన ఐదేళ్ల కాలపరిమితి లైసెన్సులను తొలగిస్తున్నామని, డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలోని అన్నీ బార్ల లైసెన్సులకు ముగింపు పలుకుతామని తెలిపి నోటీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. నూతన మద్యం పాలసీలో ప్రకారం 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం నుంచి బార్లు లైసెన్స్లు పొందేందుకు జీవోను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం జిల్లాలో ఉన్న 46 బార్లకుగానూ 29కే లైసెన్స్ ఇవ్వనున్నారు.ఆన్లైన్లో దరఖాస్తులునోటిఫికేషన్ విడుదల కాగానే ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచింది. డిసెంబరు 6వతేదీ సాయంత్రం 3 గంటల వరకు బార్లకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అదే రోజు ఎక్ష్సైజ్ అధికారులు వాటిని పరిశీలిస్తారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం డిసెంబరు 7వ తేదీ మధ్యాహ్నం లాటరీ తీస్తారు. బార్లకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే నాన్ రీ ఫండ్బుల్ కింద రూ.10 లక్షలు చెల్లించాలి. 29కే అనుమతి ఇచ్చారు. మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే జిల్లాలో 350 ఉన్న మద్యం దుకాణాలను 280కు కుదించింది. బార్లు విషయంలోనూ అదే దారిలో అడుగులు వేస్తున్నది. జిల్లాలో ప్రస్తుతం 46 బార్లు ఉన్నాయి. నూతన పాలసీలో భాగంగా 29 బార్లకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్లు ఇవ్వనుంది. అంటే ప్రస్తుతం ఉన్న బార్లలో 17 బార్లను తొలగిస్తారు. జిల్లాలో 29 బార్లకు లైసెన్స్లను ఇవ్వనుండగా వాటిలో నెల్లూరులో 20, ఆత్మకూరులో 1, కావలిలో 4, గూడూరులో 2, నాయుడుపేటలో 1, సూళ్లూరుపేటలో 1 ఏర్పాటు అవుతాయి.