నాగ్ పూర్ : మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో సంతోష్ అంబేకర్ అనే గ్యాంగ్ స్టర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి రూ. 5 .50 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. అతని అనుచరుల ఇళ్ల నుంచి కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ పై హత్య కేసు సహా 30 క్రిమినల్ కేసులున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఒప్పందానికి సంబంధించి ఈ గ్యాంగ్ స్టర్ గుజరాత్ కు చెందిన వ్యాపారిని మోసం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతని ఇంటిపై దాడులు చేశారు. ఇతని ఇంటి నుంచి ఖరీదైన కారుతో పాటు, ఇతర వాహనాలను, బైకులను స్వాధీనం చేసుకున్నారు.