మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీనే ఆధిక్యత సాధించింది. మహారాష్ట్రలో అధికారానికి అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ దక్కించుకోగా, హర్యానాలో మాత్రం పోటాపోటీగా మెజార్టీ సాధించింది. మహారాష్ట్రలో 288 సీట్లకు గానూ బీజేపీకి 102, శివసేనకు 65, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 50, కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు దక్కాయి. మహారాష్ట్రలో శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీకి అనివార్యమైంది. హర్యానాలో 90 సీట్లకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ రాలేదు. బీజేపీకి 40, కాంగ్రెస్ కి 29, ఇతర పార్టీలకు 21 సీట్లు వచ్చాయి. అందువల్ల హర్యానాలో ఇతర పార్టీల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. మెజార్టీ స్థానాలు దక్కించుకోకపోయినా అతిపెద్ద పార్టీగా బీజేపీ కావడంతో మొదటి అవకాశం బీజేపీకే దక్కే అవకాశముంది. హర్యానా, మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ను పోల్చి చూస్తే హర్యానాలో బీజేపీ ఆశించినంతగా మెజార్టీ దక్కించుకోలేదు.