మహారాష్ట్రలో పోలింగ్ కొనసాగుతుంది. బాలీవుడ్ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్లు షారుక్, గౌరీ ఖాన్ దంపతులు బాంద్రా వెస్ట్లోని పోలింగ్ బూత్ నంబర్ 177 వద్ద ఓటు వేశారు. దీపికాపదుకొనే బాంద్రావెస్ట్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కు వినియోగించుకుంది. హృతిక్రోషన్, అనిల్ కపూర్ అంధేరీ వెస్ట్లోని పోలింగ్ బూత్ వద్ద ఓటేశారు. ఓటేసేందుకు వచ్చిన తమ అభిమాన తారలను చూసేందుకు ఓటర్లు పోటీపడ్డారు.