విజయవాడ నగరంలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ కుమార్తె వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని కూడా ఉన్నారు.