ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి సమస్యను వెంటనే పరిష్కరించండి: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2019, 04:37 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు లేఖ రాశారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మోదీ సూచించారు. యూపీలోని వెనుకబడిన బుంధేల్‌ఖడ్, విద్యాంచల్ వంటి ప్రాంతాల్లో నీటి సమస్యతో పాటు మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని మోదీ వివరించారు. రానున్న రెండేళ్లలో వీటన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.


అలాగే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షకావత్‌కు కూడా మోదీ లేఖ రాశారు. యూపీపై మరింత దృష్టి సారించాలని కోరారు. దీనితో పాటు బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పవిత్ర గంగా ప్రక్షాళనను మరింత వేగవంతం చేయాలని ప్రధాని గుర్తు చేశారు. గంగా నదిని కాలుష్యం కాకుండా చర్యలు చేపట్టాలని యూపీ ప్రభుత్వాన్ని మోదీ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com