ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేశారు. వెంటనే అమరావతికి బయలుదేరి రావాలని ఆదేశించారు. దీంతో రోజా హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరారు. ఇటీవల జగన్ నేతృత్వంలో ఏర్పడ్డ మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కని సంగతి తెలిసిందే. రోజాకు ఈసారి తప్పకుండా కేబినెట్ లో చోటు దక్కుతుందని చాలామంది భావించారు. అయితే సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో ఆమెకు కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో రోజా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో రోజాను సీఎం జగన్ ఆహ్వానించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా రోజాను నియమించే అవకాశముందని భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.