పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విద్యాసాగర్ కళాశాలలో నెలకొల్పిన విగ్రహాన్ని ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ స్థానంలో ప్రభుత్వం మరొక కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించనున్నది.