ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 7 లేదా 8వ తేదీన తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. మంత్రివర్గంలో 13 నుంచి 15 మంది మంత్రులు ఉంటారు. వీరిలో ఐదుగురు సీనియర్లు కాగా, మిగిలిన వారు కొత్తవారు ఉండే అవకాశం ఉంది. మొత్తం 13 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అన్ని సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా మంత్రివర్గాన్ని రూపొందించడానికి జగన్ కసరత్తు చేస్తున్నారు.