ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. ఇద్దరు భారతీయులు అరెస్ట్

international |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:28 PM

గతేడాది టొరంటో విమానాశ్రయంలో జరిగిన బంగారం దోపిడీ కేసును కెనడా పోలీసులు చేధించారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా నిలిచిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితుల్ని ఏప్రిల్ 17న అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు భారత సంతతికి చెందినవారు కావడం గమనార్హం. ఈ కేసులో మరో ముగ్గురికి వారెంట్లు జారీ చేశారు. ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీతో వెళ్తోన్న ఎయిర్ కార్గో కంటెయినర్ను దుండగులు నకిలీ పత్రాలతో ఎత్తుకెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, విదేశీ కరెన్సీ ఉన్న కంటెయినర్‌ తరలించారు. టొరంటోకు అతి భద్రంగా దీనిని తీసుకొచ్చి, అక్కడ విమానాశ్రయంలో ఉంచారు.


అయితే, ఈ కంటెయినర్‌ను డెలివరీ చేయడానికి ముందు తప్పుడు డాక్యుమెంట్లతో అధికారులను బురిడీ కొట్టించారు నిందితులు. ఈ చోరీకి ఇద్దరు ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగులు సాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కంటెయినర్‌ను ఎత్తుకెళ్తుండగా సీసీటీవీలో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఓ నిందితుడు ట్రక్కును నడుపుతుండగా.. కంటెయినర్‌ను దానిపైకి ఎక్కించారు. విమానాశ్రయానికి చేరుకున్న కొన్ని గంటల్లో విలువైన సరుకు రాత్రికి రాత్రి అదృశ్యమైంది. దీంతో సరిహద్దుల్లో అధికారులను అప్రమత్తం చేశారు.


ప్రస్తుతం ఒకర్ని కస్టడీలోకి తీసుకోగా.. మరొకరికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నిందితుల్లో ఒంటారియోకు చెందిన భారత సంతతి యువకులు పరంపాల్ సిద్దూ, సిమ్రాన్ ప్రీత్ పనేసర్, అమిత్ జలోటా తోపాటు అమ్మద్ చైదరి, అలి రజా, ప్రసాద్ పరమలింగంను అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన ఈ దోపిడీ కేసులో సంవత్సరం పాటు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. దోపిడీ జరిగిన సమయంలో పరంపాల్ సిద్దూ ఎయిర్ కెనడాలో పనిచేస్తున్నారు. అతడే బంగారం గురించి సమాచారం ఇచ్చి, దోపిడీలో కీలక పాత్ర పోషించాడు. దోపిడీ జరిగిన విషయం మర్నాడు ఉదయం గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లోని అమెరికా-కెనడా పోలీసులు ముమ్మరంగా గాలించారు. అమెరికాలోని బ్రాంప్టన్‌కు చెందిన 25 ఏళ్ల డ్యూరాంటే కింగ్-మెక్లీన్ అనే వ్యక్తిని అరెస్టు చేయడంతో నెట్‌వర్క్‌ గుట్టురట్టయ్యింది. దొంగల మధ్య సంబంధాలను, కెనడాలోకి తుపాకీల అక్రమ రవాణాను బహిర్గతం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com