ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 08:53 PM

ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థఉలు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారు.. ఆ పత్రాల్లో అభ్యర్థుల ఆస్తులు, కేసుల వివరాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా మేమంత సిద్ధం బస్సు యాత్రంలో భాగంగా అభ్యర్థుల్ని పరిచయం చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుట్టా రేణుకను పరిచయం చేసే క్రమంలో ఆమె బీసీ కులానికి చెందిన చెల్లెమ్మ.. ఆర్థికంగా కూడా అంతంతమాత్రమే అన్నారు. ఈ క్రమంలో బుట్టా రేణుక ఆస్తుల గురించి చర్చ జరిగింది. అయితే బుట్టా రేణుక తన నామినేషన్ దాఖలు చేయగా.. ఆస్తుల వివరాలను ప్రస్తావించారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుట్టా రేణుక అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. అఫిడవిట్‌ ప్రకారం.. రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ మొత్తం రూ.161.21 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.142.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు. అప్పులు రూ.7.82 కోట్లు. 2014లో వీరి ఆస్తులు రూ.242.60 కోట్లు. బుట్టా రేణుక ఆటోమొబైల్స్‌, హోటళ్లు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. హోండా, టాటా మోటార్స్‌ వాహనాల డీలర్‌షిప్‌ కలిగి ఉన్నారు. బుట్టా కన్వెన్షన్‌ హాలు నడుపుతున్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌, ఇజ్జత్‌నగర్‌లలో ప్లాట్లు, భవనాలున్నాయి. 2,375 గ్రాముల బంగారం, వజ్రాల హారాలు, విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలున్నాయి. వీటి విలువ రూ.2.54 కోట్లు. రేణుక భర్త పేరిట 435 గ్రాముల బంగారు నగలున్నాయి. బుట్టా దంపతులకు తేజస్వి జ్యువెలర్స్‌లో రూ.11.10 కోట్లు, తేజస్వి మోటార్స్‌లో రూ.24 కోట్లు, బుట్టా హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.17.46 కోట్లు, బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.59.68 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు నడుస్తున్నాయి. కర్నూలులో ఒక కేసు ఉంది. బుట్టా రేణుక ఆస్తుల వివరాలు వెల్లడించడంతో మరోసారి చర్చ జరుగుతోంది. అయితే 2014 ఎన్నికలతో పోలిస్తే.. 2024కు ఆస్తులు తగ్గాయనే చెప్పాలి.


మరోవైపు శ్రీశైలం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తుల విలువ పదేళ్లలో భారీగా పెరిగింది. అఫిడవిట్‌ ప్రకారం.. 2014లో చక్రపాణిరెడ్డి, ఆయన భార్య, కుమారుడు.. ముగ్గురి ఆస్తి రూ.49.89 కోట్లు కాగా.. అది 2019లో రూ.37.27 కోట్లు మాత్రమే. 2024కు వచ్చేసరికి 131.71 కోట్లుగా, అప్పులు 28.24 కోట్లుగా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com